Free Bus Travel for Disabled! : ఏపీ త్వరలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం!

seen from Malaysia

seen from China

seen from United States
seen from United States
seen from China
seen from Philippines

seen from Türkiye
seen from China

seen from Malaysia
seen from United States

seen from Türkiye
seen from Japan

seen from Malaysia
seen from Malaysia
seen from Spain

seen from United States

seen from Malaysia

seen from United States
seen from China

seen from Türkiye
Free Bus Travel for Disabled! : ఏపీ త్వరలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం!
AP Budget : ఏపీ బడ్జెట్.. అమరావతికి రూ.6 వేల కోట్లు
Trinethram News : అమరావతి: రాజధాని అమరావతి కోసం ఏపీ ప్రభుత్వం బడ్జెట్
AP Cabinet Meeting : నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం
రాబడి లేదు.. గ్రాంట్లు లేవు.. -ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ,June 17,2020 రాష్ట్రానికి రెవెన్యూ రాబడులు ఏకంగా రూ.67,826.27 కోట్ల మేర తగ్గిపోయాయి. 2019–20 సవరించిన అంచనాల ప్రకారం ఈ విషయం స్పష్టమైంది. గత ఆర్థిక ఏడాది (2019–20) మొత్తం రెవెన్యూ రాబడులు రూ.1,78,697.41 కోట్లు వస్తాయని అంచనా వేయగా.. రూ.1,10,871.14 కోట్లే వచ్చాయని ఆర్థిక మంత్రి చెప్పారు. ఆర్థిక మందగమనంలో కేంద్రం నుంచి పన్నుల వాటా రూపంలో రావాల్సిన నిధులు కూడా గత ఆర్థిక ఏడాది రూ. 34,838.18 కోట్లు వస్తాయని అంచనా వేయగా రూ. 28,224.50 కోట్లు వచ్చాయి. అంటే రూ. 6,608.68 కోట్లు మేర తగ్గాయి. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రూ. 61,071.51 కోట్లు వస్తాయని అంచనా వేయగా.. రూ. 21,875.95 కోట్లు మాత్రమే వచ్చాయి. రూ. 39,195.56 కోట్లు తగ్గిపోయాయి. ఆర్థిక మందగమనం వల్ల రాష్ట్ర పన్నుల వసూలుపై కూడా పడింది. వ్యాట్ ద్వారా రూ. 55,000 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేయగా.. రూ. 41,464.73 కోట్ల రూపయాలే వచ్చాయి. రూ. 13,535.27 కోట్ల మేర ఆదాయం తగ్గింది. 2019–20 ఏడాది ఎక్సైజ్ ద్వారా రూ. 8,517.99 కోట్లు వస్తాయని అంచనా వేసుకుంటే.. రూ. 6,914.75 కోట్లు మాత్రమే వచ్చాయి. రూ. 1603.24 కోట్లు తగ్గిపోయాయి.మధ్య నియంత్రణ కూడా కారణం రవాణా రంగం ద్వారా రూ. 4000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేయగా రూ. 3,278.74 కోట్లు వచ్చాయి. ఈ రంగంలో రూ. 721.26 కోట్ల మేర ఆదాయం తగ్గిపోయింది. Note: జగన్ ప్రమాణ శ్వీకారం రోజు మే 30 ,2019 న ఖజానా లో కేవలం వంద కోట్లే పెట్టి దిగిపోయాడు బాబు , జీతభత్యాలు పెన్షన్ లకు 6 వేల కోట్లు కావాలి అని ఆ రోజు ఈనాడు పత్రిక రాసింది అటువంటి అప్పుల కుప్ప ఒకవైపు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్ధిక మందగమనం ఇంకోవైపు .. అయినా కూడా 41 వేల కోట్లు ఖర్చు పెట్టి 3 .62 కోట్ల మందికి సంక్షేమ ఫలాలు అందించాడు జగన్ #YSJagan #BugganaRajendranathReddy #APBudget #APassembly https://www.instagram.com/p/CBk2AORl8ru/?igshid=1t3085hqpwfug
కనికట్టు బడ్జెట్ #PawanKalyan #APBudget #APassembly #Andhara_Pradesh #journalistsai https://www.instagram.com/p/CBf6jgLFBHL/?igshid=1anv6occd609w
*రూ.2.24లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్* అమరావతి: ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి శాసనసభలో వరుసగా రెండో సారి రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. కరోనా మహమ్మారిపై పోరాటంలో ముందున్నామని, లాక్డౌన్ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ కుంటుపడకుండా చూశామని ఆర్థిక మంత్రి తెలిపారు. అట్టడుగున ఉన్న పేద ప్రజలను ఆర్థికసాయం ద్వారా పైకితీసుకు రావాలని, మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు మార్చాలని సీఎం తీసుకున్న నిర్ణయాలు సవాళ్లుగా మారాయని వివరించారు. గత ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రజాధనాన్ని ఖర్చు చేసే విధానాన్ని తమ ప్రభుత్వం వ్యతిరేకించిందని స్పష్టం చేశారు. రూ.2.24లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్ బడ్జెట్ కేటాయింపులు ఇలా * బడ్జెట్ అంచనా వ్యయం రూ.2,24,789.18 కోట్లు * రెవెన్యూ వ్యయం అంచనా రూ.1,80,392.65 కోట్లు *మూలధన వ్యయం అంచనా రూ.44,396.54 కోట్లు * వ్యవసాయానికి రూ.11,891 కోట్లు * వైఎస్సార్ రైతు భరోసా రూ.3,615 కోట్లు * ధరల స్థిరీకరణ నిధి రూ.3వేల కోట్లు * వడ్డీలేని రుణాల కోసం రూ.1100 కోట్లు * బీసీల సంక్షేమానికి రూ.23,406 కోట్లు * విద్యకు రూ.22,604 కోట్లు * మైనార్టీల సక్షేమానికి రూ.1998 కోట్లు * ఎస్టీల సంక్షేమానికి రూ.1,840 కోట్లు * ఎస్సీల సంక్షేమానికి రూ.7,525 కోట్లు * కాపుల సంక్షేమానికి రూ.2,845 కోట్లు * వైద్య రంగానికి రూ.11,419 కోట్లు * ఆరోగ్యశ్రీకి రూ.2,100 కోట్లు * వైఎస్ఆర్ గృహ వసతికి రూ.3వేల కోట్లు * పీఎం ఆవాస్ యోజన(అర్బన్) రూ.2,540 కోట్లు * పీఎం ఆవస్యోజన(గ్రామీణం) రూ.500 కోట్లు * బలహీన వర్గాల గృహనిర్మాణానికి రూ.150 కోట్లు * రేషన్ బియ్యానికి రూ.3వేల కోట్లు * డ్వాక్రా సంఘాలకు రూ.975 కోట్లు * రూ.8వేల కోట్లతో 30లక్షల ఇళ్ల పట్టాలు * అభివృద్ధి పథకాలకు రూ.84,140.97 కోట్లు * షెడ్యూల్డుకులాల అభివృద్ధికి రూ.15,735.68 కోట్లు * షెడ్యూల్డు తెగలకు రూ.5,177.53 కోట్లు * బీసీల అభివృద్ధికి రూ.25,331.30 కోట్లు. బీసీ కులాలకు గతంలో పోలిస్తే 68.18శాతం అధికం * మైనార్టీల అభివృద్ధికి 2050.22 కోట్లు. మైనార్టీలకు గతేడాదితో పోలిస్తే 116.10శాతం అధికం. * జగనన్న చేదోడు పథకానికి 247 కోట్లు. #APBudget #APassembly #Andhra_Pradesh #YSJagan #BugganaRajendranathReddy #telugunews #journalistsai https://www.instagram.com/p/CBfgMOyFp0w/?igshid=111gwklgjhex7
మూడు రాజధానులే... ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఏపీ గవర్నర్! పరిపాలన వికేంద్రీకరణ కీలకం మూడు రాజధానుల బిల్లు శాసన ప్రక్రియలో ఉంది ఏపీ గవర్నర్ భిశ్వభూషణ్ హరిచందన్ ఈ ఉదయం ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలిలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, మూడు రాజధానుల అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరిపాలన వికేంద్రీకరణ అత్యంత కీలకమని వ్యాఖ్యానించిన ఆయన, అన్ని ప్రాంతాల అభివృద్ధే తన ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. ప్రస్తుతం మూడు రాజధానుల బిల్లు శాసన ప్రక్రియలో ఉందని అన్నారు. మూడు రాజధానులకు తన ప్రభుత్వం కట్టుబడివుందని తెలిపారు. అమరావతి శాసన రాజధానిగా, విశాఖపట్నం కార్య నిర్వాహక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటాయని అన్నారు. భవిష్యత్తులో తన ప్రభుత్వానికి మంచి రోజులు వస్తాయని, ఈ బిల్లు కూడా ఆమోదం పొందుతుందని ఆయన అన్నారు. కాగా, ఈ బిల్లును తమకు బలం ఉన్న అసెంబ్లీలో ఆమోదించుకున్న వైఎస్ జగన్ సర్కారు, మండలిలో మాత్రం నెగ్గించుకోలేకపోయిందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గవర్నర్ తన ప్రసంగంలో శాసన ప్రక్రియలో బిల్లు ఉందని వ్యాఖ్యానించారని భావించవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇదే సమయంలో మరికొన్ని నెలల్లో మండలిలో సైతం వైసీపీకి బలం పెరుగుతుందని, అప్పుడు ఈ బిల్లుకు ఆమోదం లభిస్తుందని విశ్లేషిస్తున్నారు. #BiswaBhusanHarichandan #Andhra_Pradesh #APBudget #APassembly #YSJagan #APpolitics #YCPGovernment #telugunews #journalistsai https://www.instagram.com/p/CBfQ5R0FArQ/?igshid=za7j5p0na26w
SRI BUGGANA RAJENDRANATH, MINISTER FOR FINANCE SUBMITTING 2020-21 BUDGET COPY TO SRI YS JAGAN MOHAN REDDY, HONBLE CHIEF MINISTER OF AP AT ASSEMBLY ON 16-06-2020 #YSJagan #APassembly #APBudget #BugganaRajendranathReddy #APpolitics #journalistsai https://www.instagram.com/p/CBfQSwxl7k5/?igshid=rnuwtp9b8rhr