జనవరి 8న జమిలి ఎన్నికల బిల్లు జేఏసీ మీటింగ్ Trinethram News : 'వన్ నేషన
seen from United States

seen from United States

seen from United States
seen from Canada
seen from United States
seen from United States
seen from United States
seen from China
seen from Australia
seen from China

seen from United States
seen from United States

seen from United States
seen from Philippines
seen from United States

seen from United States
seen from T1

seen from United States

seen from Spain
seen from United States
జనవరి 8న జమిలి ఎన్నికల బిల్లు జేఏసీ మీటింగ్ Trinethram News : 'వన్ నేషన
జమిలి బిల్లు.. జేపీసీకి పంపేందుకు కేంద్రం సిద్ధం: అమిత్ షా Tr
నేడు లోక్సభలో జమిలి బిల్లు..!! Trinethram News : జమిలి ఎన్నికలకు సంబంధ
ఇప్పట్లో ‘జమిలి’కుదరదు
ఇప్పట్లో ‘జమిలి’కుదరదు చాలా కొత్త ఈవీఎంలు కావాలి 15 ఏళ్లకు రూ.10 వేల కోట్లు ఖర్చు అవుతుంది: ఈసీ న్యూడిల్లీ : దేశంలో జమిలి ఎన్నికలపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. జమిలి ఎన్నికలు జరిపించాలని మోదీ కంకణబద్ధులై ఉండగా… వద్దని ప్రతిపక్షాలు ముక్తకంఠంతో నినదిస్తున్నాయి. పార్లమెంటరీ వ్యవస్థకు, రాజ్యాంగానికి, ఫెడరలిజానికి ఈ ప్రక్రియ పూర్తిగా విరుద్ధమని, పార్లమెంటరీ స్ఫూర్తికి వ్యతిరేకంగా జమిలి ఎన్నికలు నిర్వహిస్తే తీరని నష్టం జరుగుతుందని చెబుతున్నాయి. ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరిపించడం ద్వారా ఖజానాపై పెద్దగా భారం ఉండదని, మొత్తం బడ్జెట్లో 0.02శాతంగానే ఎన్నికల వ్యయం ఉంటుందన్నాయి. కానీ ఎలాగైనా జమిలి ఎన్నికలు జరిపించాలని మోదీ ప్రభుత్వం సంకల్పించింది. వీటిని సమర్థించుకుంటూ ప్రకటనలు చేస్తోంది. అటు ఎన్నికల కమిషన్ కూడా కేంద్రానికి వత్తాలు పలుకుతోంది. జమిలి ఎన్నికల నిర్వహణకు కసరత్తు మొదలు పెట్టింది. అయితే లోక్సభకు, శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరిపిస్తే కొత్త ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంలు) సేకరించేందుకు రూ.10కోట్ల వ్యయం ప్రతి 15 ఏళ్లకు అవుతుందని ఎన్నికల సంఘం తాజాగా అంచనా వేసింది. 2029కి ముందు జమిలి ఎన్నికలు సాధ్యం కాకపోవచ్చ అన్న అభిప్రాయాన్ని ఈసీ గతంలోనే వ్యక్తంచేసింది. ఈ ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా 11.80 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న అంచనా ఉంది. ఈవీఎంలు 15ఏళ్లకు మించి పనిచేయబోవని, ఒక సెట్ను మూడుసార్లు వాడవచ్చని ప్రభుత్వానికి కమిషన్ సమాచారం ఇచ్చింది. జమిలి ఎన్నికలకు వెళ్తే ప్రతి పోలింగ్ కేంద్రానికి రెండు సెట్ల ఈవీఎంలు కావాలని, అందులో ఒకటి లోక్సభ స్థానానికి కాగా మరొకటి అసెంబ్లీ నియోజకవర్గానికి అవసరమని తెలిపింది. గత అనుభవాలను బట్టి సమస్యాత్మక యంత్రాల స్థానంలో కొత్తవాటిని భర్తీ చేసేందుకు కొన్ని కంట్రోల్ యూనిట్లు (సీయూ), బ్యాలెట్ యూనిట్లు (బీయూ), వీవీప్యాట్ మెషిన్లను అదనంగా రిజర్వ్ చేయాల్సి ఉంటుందని, కనీసం ఒక ఈవీఎంకు ఒక బీయూ, సీయూ, వీవీప్యాట్ అవసరమని వెల్లడిరచింది. జమిలి ఎన్నికలకు వెళ్తే కనిష్ఠంగా 46,75,100 బ్యాలెట్ యూనిట్లు , 33,63,300 కంట్రోల్ యూనిట్లు, 36,62,600 వీవీప్యాట్ యంత్రాలు కావాలని తెలిపింది. 2023 ప్రారంభం నాటికి ఈవీఎం ధరను పరిశీలిస్తే.. ఒక్కో బ్యాలెట్ యూనిట్ ధర రూ.7900, కంట్రోల్ యూనిట్ ధర రూ.9,800, వీవీప్యాట్ ధర రూ.16వేలుగా ఉంది. ఈ లెక్కన, జమిలి ఎన్నికలకు వెళ్తే ప్రతి 15ఏళ్లకోసారి కొత్త ఈవీఎంలను కొనాలని, వాటికి రూ.10వేల కోట్ల చొప్పున ఖర్చవుతుందని ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. అదనపు పోలింగ్, భద్రతా సిబ్బంది, ఈవీఎంలకు మెరుగైన నిల్వ సౌకర్యాలు, మరిన్ని వాహనాలు అవసరమని కూడా చెప్పింది. కొత్త యంత్రాల ఉత్పత్తి దృష్ట్యా వేర్హౌసింగ్తో పాటు ఇతర లాజిస్టిక్ సమస్యలు పెరుగుతాయని, 2029కి ముందు జమిలి ఎన్నికలు నిర్వహించే వీలు లేదని ఈసీ తెలిపింది. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగంలోని సంబంధిత ఐదు అధికరణాలను సరవించాలని కూడా కేంద్రప్రభుత్వం దృష్టికి ఎన్నికల సంఘం తీసుకెళ్లింది. ఆర్టికల్స్ 83, 85, 172, 174, 356కు సవరణలు అవసరమని చెప్పింది. రాజ్యాంగం పదవ షెడ్యూల్లోనూ మార్పులు జరగాలని పేర్కొంది. అయితే దేశంలో జమిలి ఎన్నికల సాధ్యసాధ్యాలను పరిశీలించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
Read the full article
'జమిలి ఎన్నికలు' రాజ్యాంగ విరుద్ధం.. కమిటీని రద్దు చేయండి: ఖర్గే
'జమిలి ఎన్నికలు' రాజ్యాంగ విరుద్ధం.. కమిటీని రద్దు చేయండి: ఖర్గే దిల్లీ: 'ఒకే దేశం- ఒకే ఎన్నిక (One Nation One Election)' ఆలోచనను కాంగ్రెస్ (Congress) తీవ్రంగా వ్యతిరేకించింది. రాజ్యాంగ మౌలిక స్వరూపానికి, సమాఖ్య హామీలకు ఇది విరుద్ధంగా ఉందని పేర్కొంది.. జమిలి ఎన్నికలపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రామ్నాథ్ కోవింద్ కమిటీ (Kovind Panel)కి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) ఈమేరకు లేఖ రాశారు. దేశంలో పటిష్ఠమైన ప్రజాస్వామ్యాన్ని కొనసాగించాలంటే.. ఈ ఆలోచనను విరమించుకోవాలన్నారు. దీనికోసం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీని రద్దు చేయాలని కోరారు. "రాజ్యాంగాన్ని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేలా.. కమిటీ ఛైర్మన్ తన వ్యక్తిత్వాన్ని, మాజీ రాష్ట్రపతి కార్యాలయాన్ని దుర్వినియోగం చేసేందుకు కేంద్రాన్ని అనుమతించవద్దు. పార్టీ, దేశ ప్రజల తరఫున ఈమేరకు అభ్యర్థిస్తున్నా'' అని ఖర్గే పేర్కొన్నారు. ఏకకాలంలో ఎన్నికల వంటి అప్రజాస్వామిక ఆలోచనల ద్వారా ప్రజల దృష్టిని మళ్లించకుండా.. వారి ఆదేశాన్ని గౌరవించేలా ప్రభుత్వం, పార్లమెంట్, ఎన్నికల సంఘం కలిసి పని చేయాలన్నారు. మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని టీఎంసీ సైతం ఇటీవల 'జమిలి' భావనతో ఏకీభవించడం లేదని స్పష్టం చేసింది. 'ఒకే దేశం- ఒకే ఎన్నిక'పై అధ్యయనం కోసం గతేడాది సెప్టెంబరులో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది. అప్పటినుంచి రెండుసార్లు సమావేశాలు నిర్వహించింది. ఇటీవల ఆరు జాతీయ, 33 ప్రాంతీయ పార్టీల నుంచి అభిప్రాయాలు కోరింది. జమిలి ఎన్నికలపై న్యాయ కమిషన్ నుంచి కూడా సలహాలు తీసుకుంది. ప్రజల నుంచి సలహాలు, సూచనలను స్వీకరించింది. ఈ అంశంపై మాజీ ఎన్నికల ప్రధానాధికారులు, హైకోర్టుల మాజీ చీఫ్ జస్టిస్లతో కమిటీ ఛైర్మన్ రామ్నాథ్ కోవింద్ తాజాగా చర్చలు ప్రారంభించారు..
Read the full article
జమిలి ఎన్నికలపై.. 5000 సూచనలు
జమిలి ఎన్నికలపై.. 5000 సూచనలు దిల్లీ: 'ఒకే దేశం - ఒకే ఎన్నిక (One Nation, One Election)'పై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ (Ram Nath Kovind) నేతృత్వంలో కేంద్రం కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఈ కమిటీ చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే ప్రజల నుంచి సలహాలు, సూచనలను ఆహ్వానించింది. దీనికి విశేష స్పందన లభిస్తోంది. వేలాది మంది ప్రజలు తమ సూచన (suggestions)లను పంపిస్తున్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకు 5వేలకు పైగా ఈ-మెయిళ్లు వచ్చినట్లు పేర్కొన్నాయి. దేశంలో జమిలి ఎన్నికల (Simultaneous Polls)ను నిర్వహించేలా.. ప్రస్తుతం ఉన్న చట్టపరమైన అడ్మినిస్ట్రేటివ్ ఫ్రేమ్వర్క్లో తగిన మార్పులను సూచించాలని కోవింద్ కమిటీ ఇటీవల ఓ ప్రకటనలో కోరింది. జనవరి 15లోగా ప్రజలు తమ సలహాలు, సూచనలు పంపవచ్చని వెల్లడించింది. ఈ సూచనలను కమిటీ వెబ్సైట్ onoe.gov.inలో పోస్ట్ చేయాలని లేదంటే [email protected] ఐడీకి ఈ-మెయిల్ చేయాలని తెలిపింది. ఒకే దేశం- ఒకే ఎన్నిక కోసం గతేడాది సెప్టెంబరులో ఈ కమిటీ ఏర్పాటైంది. అప్పటి నుంచి రెండుసార్లు సమావేశాలు నిర్వహించింది. ఇటీవల ఆరు జాతీయ పార్టీలు, 33 ప్రాంతీయ పార్టీల నుంచి అభిప్రాయాలు కోరింది. జమిలి ఎన్నికలపై న్యాయ కమిషన్ నుంచి కూడా సలహాలు తీసుకుంది.
Read the full article
Day 1