#RBI #100RSNote కొత్త వంద నోటు కోసం బారులు తీరిన జంటనగరవాసులు! సైఫాబాద్లోని ప్రాంతీయ ఆర్బీఐ కార్యాలయానికి పెద్దసంఖ్యలో నేడు ప్రజలు తరలివచ్చారు. ఈ హడావిడంతా దేనికని తెల్సుకోగా....రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూ.వందనోటు విడుదల చేసినట్లు తెలిసింది. దీని కోసమే హైదరబాద్ నగర వాసులు బారులు తీరారు. ఉదయం 7గంటల నుంచే క్యూలో నుంచొని కొత్త నోటు అందుకునేందుకు ఉత్సాహాన్ని కనబరిచారు. మరో నాలుగు కొత్త కార్లు మారుతి నుంచి కొత్త వంద నోటు అందుకున్న అనంతరం కొందరు బయటకు రాగానే వాటితో సెల్ఫీలు దిగడం కూడా కనిపించింది. రద్దీని దృష్టిలో ఉంచుకొని పరిమిత సంఖ్యలోనే ఈ కొత్త నోట్లను ఆర్బీఐ అధికారులు అందజేస్తున్నారు. మహాత్మాగాంధీ కొత్త సిరీస్లో భాగంగా విడుదల చేసిన ఈ నోటుపై ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం ఉంటుంది. ప్రపంచ వారసత్వ జాబితాలో గుర్తింపు పొందిన గుజరాత్లోని చారిత్రక కట్టడం ‘రాణి కీ వావ్’ ఫొటో నోటు వెనుక భాగంలో ముద్రించారు. ఈ కొత్త వంద నోటు ఊదా రంగులో ఉంటుంది. ఈ నోటుపై 100ను దేవనాగరి లిపిలోనూ ముద్రించారు. పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత చిల్లర కష్టాలను తీర్చేందుకు ఆర్బీఐ కొత్తగా రూ.200, రూ.10, రూ.50 నోట్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.











