Chain Snatching : హన్మకొండ నగరంలోని ఎక్సైజ్ కాలనీలో చెయిన్ స్నాచింగ్
Trinethram News : ఉదయం ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా మెడలోని బంగారు చెయ
seen from Russia
seen from Italy
seen from Japan

seen from Jordan
seen from Japan
seen from United States

seen from Italy
seen from Russia
seen from China
seen from China
seen from United States

seen from Malaysia
seen from Maldives
seen from Russia

seen from United States

seen from United States

seen from Australia
seen from United Kingdom
seen from United States

seen from United States
Chain Snatching : హన్మకొండ నగరంలోని ఎక్సైజ్ కాలనీలో చెయిన్ స్నాచింగ్
Trinethram News : ఉదయం ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా మెడలోని బంగారు చెయ
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ హన్మకొండ పర్యటన రద్దు వరంగల
మేడారం హుండీలో బెట్టింగ్ సమస్య !
హన్మకొండలో మేడారం హుండీ లెక్కింపు కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. ఓ మహిళ వినూత్నంగా తన కోరికల చిట్టిని హుండీలో వేసింది. ఇందులో బెట్టింగ్కి బానిసైన తన భర్త బెట్టింగ్ మానేయాలని కోరడం చర్చనీయాంశంగా మారింది…
Read the full article
మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలు
పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హనుమకొండ నుంచి మేడారం వేళ్లేందుకు ఏర్పాట్లు.. హెలికాప్టర్ లో ప్రయాణించిన వారికి ప్రత్యేక దర్శనం కూడా ఉండనుంది. ఈ నెల 21 నుంచి 25 వరకు ఈ సేవలు అందుబాటులో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది..
Read the full article
నంది జాతీయ పురస్కారం అందుకున్న నూతి అభిలాష్
Trinethram News : హన్మకొండ జిల్లా : ఫిబ్రవరి 04 యువచైతన్య వెల్ఫేర్ సొసైటీ. విశ్వకర్మ సేవా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో స్వామి వివేకానంద మరియు సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాల-2024 సందర్భంగా,మంచిర్యాల జిల్లా రామ్ నగర్ కు చెందిన బ్రహ్మశ్రీ.డా. నూతి. అభి లాష్ వెలుగు నంది పురస్కారాన్ని ఈరోజు అందుకున్నారు. సాహితీ మరియూ విద్యా రంగంలో విశిష్టమైన కృషి చేసినందుకు గాను తెలుగు వెలుగు జాతీయ నంది పురస్కారం అందుకోవడం తనకు సంతోషంగా ఉందన్నారు.నూతి అభిలాష్.. ఈరోజు ఆదివారం రోజున టీఎన్జీవో భవన్ హనుమకొండ లో జరిగిన ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి వర్ధన్నపేట శాసనసభ్యులు కె ఆర్ నాగరాజు హనుమకొండ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ డాక్టర్.మారేపల్లి సుధీర్ కుమార్ చేతుల మీదుగా జాతీయ పురస్కారాన్ని నూతి అభిలాష్ అందుకున్నారు…
Read the full article
Telangana 99percent belongs to Bahujans, Whom you are KCR to Dictate us, Get out from 'the chair', We are coming soon!!: RSP from BSP
మన బహుజనులు పేదరికంలో ఎందుకు ఉన్నారో తెలుసా? మన రాజ్యం లేకనే: ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, బీఎస్పీ చీఫ్ తెలంగాణ
ఇవాళ సాయంత్రం హన్మకొండ సభలో బహుజన దండు కదిలింది. జయంశంకర్ సార్ స్పూర్తితో, 1300 వందల మంది అమరవీరుల త్యాగాల సాక్షిగా అందరి తెలంగాణ కోసం బహుజన రాజ్యం కావాలన్నారు బీఎస్పీ చీఫ్ ఆరేస్ ప్రవీణ్ కుమార్. తెలంగాణ బహుజనులకు బీఎస్పీ జాతీయ కార్యదర్శి ఆకాష్ ఆనంద్, ఏడు రాష్ట్రాల ఇంఛార్జ్, ఎంపీ రాంజీ గౌతమ్ దిశా నిర్దేశించారు. సాహుమహ రాజ్ జయంతి రోజున, సమ్మక్క సారలమ్మల ఆశీర్వాదంతో సభకు ఇసుక ఎస్తే రాలనంత జనం తరలివచ్చారు.
మా వెనకాల మెఘా కంపెనీలు లేవు, మై హోం లేదు,
నిరుద్యోగులు ఉన్నారు. ఫించన్ లు తీసుకునే అవ్వతాతలు ఉన్నారు. బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యంగా సుమారు 100 మంది 15 వేల కిలోమీటర్లు తిరిగినాం... 700 పైన గ్రామాలు తీరిగినాం. ఒక చిన్న ఉద్యోగి 30 మందికి తిండి పెట్టిండు. వంద రోజులు ఒక తమ్ముడు చెన్నై నుంచి వచ్చి మాకు తిండి పెట్టిండు. 100 మందితో మేము పండుకుంటే.. గ్రామాల్లో సీసాలు అమ్ముకొని బతకమని చెప్పే ఎర్రవల్లి దయాకర్ రావు వారిని వెంటనే వెళ్లగొట్టాలని తన మనుషులను పంపించిండు.
త్యాగాలు వృధా పోవు. ప్రవీన్ కుమార్ కు తిండి పెడితే దళితబంధు ఇవ్వనని చెబితే నాకు దళిత బంధు ఇవ్వకపోయినా పర్వాలేదు నా కొడుకు వస్తుండు అని వారి హెచ్చరికను ఖాతరు చేయకుండా అన్న పెట్టింది. ఇంకొక అవ్వ తన ఫించన్ నుంచి 200 వందల రూపాయలు ఇచ్చింది. ఇంకో అన్న నాకు ఫించన్ లు రాలే ఇన్ని రోజులు ఎక్కడికి పోయిండు అని మమ్ములు నిలదీసిండు. మిర్యాలగూడ రమణమ్మ 50 రూపాయల చిల్లర ఇచ్చింది మా వెనకాల ఉన్నది వీళ్లే కేసీఆర్. ఒక ఆఫీసర్ ఇంట్లో పెళ్లి ఫంక్షన్ కు 50 లక్షలు బహుమతిగా పంపితే ఒక లక్షకోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్ని కోట్లు ఈ పందికొక్కులు మెక్కింటరు ఒకసారి ఆలోచించండి.
ఊరూరా క్రీడా మైదానాలు, వైకుంఠ దామాలకు దళితుల భూములు లకుకున్నడు కేసీఆర్. దేశంలో అంత్యంత ఎక్కువగా మద్యం తాగే రాష్ట్రం ఏదంటే తెలంగాణనే. మనం విద్య అడిగితే ఈకేసీఆర్ మద్యం పోస్తుండు. బహుజన రాజ్యంలో బెల్టు షాపులు అన్ని బంద్ పెడుతాం. గాదర్ కిషోర్ ,కేటీఆర్ లు మన బహుజన బిడ్డల మీద పీడీ కేసులుపెడుతున్నారు. బహుజనుల మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి. ఇసుక మాఫియాలో పేరు దళితునిది ఉంటది. పోడు భూములల్ల ఫారెస్ట్ ఆఫీసర్లతో వెళ్లగొడతరు. అసైన్డ్ భూములకు, పోడు భూములకు పట్టాలిచ్చే ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ. పస్తులుండి రైతన్నలు, కౌలు రైతులు, పంటపండిస్తుంటే ఆ పంట మనకు చెందదు. ప్రతి ఎకరా ప్రతి పేదవాడికి ఇస్తం. నోటిఫికేషన్ లు రాని తెలంగాణలో 10 లక్షల నోటిఫికేషన్ లు ఇస్తం గుర్తుపెట్టుకోండి, నిజమైన హక్కుదారులం మేము.
ఒక రాజకీయ నాయకుడు మాట్లాడే మాటనా ఇది. రాజ్యం మాది నూటికి 99 మంది మేమే ఉన్నం. మా కాళ్ల మీద మేమే నిలబడతాం. ఎవడి కాళ్ల మీద పడం ఏం చేస్తవో చేసుకో. రాజన్న రాజ్యం అని చెప్పుకొని తిరుగుతున్న ఒక నాయకురాలు ప్రతి ఒక్కరికి వేయి రూపాయల ఇవ్వడానికి ఎక్కడ నుంచి వస్తున్నవి. రెక్కాడితే డొక్కాడని పేదలు.. దొర ఏది చెబితే అది చేయడానిక బానిసలు కాదు. ఎల్లారెడ్డి గూడెంల ఒక టీఆర్ఎస్ నాయకుడు వచ్చి మాట్లాడిండు.
మన పేదరికానికి కారణం మన రాజ్యం లేకపోవడమే. 110 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేసిండు ఒక తమ్ముడు. పెట్రోల్ కు ఇస్తలేడనో, డీజీల్ ఇస్తలేడనో మా బిడ్డలు అడుగుతలేరు. ప్రేమతో వస్తున్నారు. ఆ తమ్ముడి మీద కేసు పెడతమని భయపడిస్తున్నారు. ప్రతి విద్యార్థిని బహుజనరాజ్యం అన్ని కులాల పేదలకు వారికి ఎకరాకు తక్కువ కాకుండా ఇస్తం.
బాసర ఐఐఐటీలో విద్యార్థినిలకు బాత్రుములు లేవు. ఆ విద్యార్థులు ఏమి అడిగిండ్రు కేసీఆర్ ఒకసారి బాసర ఐఐఐటీకి వచ్చిపోమ్మని అడిగిండ్రు. అది తప్పా. మన విద్యాలయాలకు రాని సీఎం మనకు చదువులు సరిగా నేర్పిస్తారా?
-వేంకటేశ్వర్లు బోయ, తెలంగాణ జర్నలిస్ట్, గద్వాల్
Press Note from BSP
(కాలం గతించిన..
నిజం కనుమరుగవదు...
చరిత్ర పుటల్లో నిజం ఎప్పుడు సజీవంగానే ఉంటుంది.
వాస్తవాలు వాదనల ద్వారా, వాదాల ద్వారా చరిత్రలో తిరిగి తిరిగి ప్రజల వద్దకు మరలా చేరుతాయి..
తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం ఒక వైపు,
సామాజిక ఉద్యమాలు రెండోవైపు , ప్రత్యేక తెలంగాణ కావాలని ఒకరు... సామాజిక తెలంగాణ కావాలని అని మరికొంతమంది ఎన్నో సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తూ వచ్చారు. ప్రజల ఆకాంక్ష బలంగా తెలంగాణ కావాలని ఉంది.. ఆకాంక్ష నెరవేరింది. తెలంగాణ రానే వచ్చింది.
ఇప్పుడు కావాలి సామాజిక తెలంగాణ, సమసమాజ స్థాపనకు, అత్యధిక వర్గ జనాల ప్రయోజనాలకై ఒక ఉద్యమం బహుజన ఉద్యమం బహుజన్ సమాజ్ పార్టీ రూపంలో కదులుతూనే ఉంది. కాన్షీరామ్ గారి హయాంలో వరదల పొంగిన బహుజన వాదం తెలుగు రాష్ట్రాల్లో ఆయన నిర్యాణం తర్వాత కాస్త నెమ్మదించింది. ఎన్నో పార్టీలు అవతరించి కాలగర్భంలో కలిసిపోయి నా బహుజన్ సమాజ్ పార్టీ మాత్రం ఆత్మగౌరవపు శిఖరం పైన అలాగే నిలిచి ఉంది.
ప్రత్యేకంగా ఏర్పడిన తెలంగాణలో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి మంద ప్రభాకర్ గారి ని వరించింది. పార్టీ పెద్దలు తన సేవలు గుర్తించి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించి బెహెంజి మాయావతి ఆశీస్సులతో పార్టీ పగ్గాలు అప్పగించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక చిన్న నాయకుడిగా మొదలైన మంద ప్రభాకర్ గారి ప్రస్థానం అంచెలంచెలుగా ఎదిగి వివిధ దశల్లో వివిధ పదవులను తనకున్న పరిధిలో సమర్థవంతంగా నిర్వహించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. బామ్ సేఫ్ రాష్ట్ర కన్వీనర్ గా పార్టీకి ఆర్థిక వనరులకు విపరీతమైన కృషి చేశారు.
ఉద్యోగస్తుల , మేధావులను కూడగట్టే పనిని, ఆర్థిక వనరులను సమకూర్చే పని తన భుజాల పైన వేసుకొని, తన సహచర నాయకులతో కలిసి పార్టీని ముందుకు నడిపే ప్రయత్నం చేశారు. కరోనా సమయంలో కూడా బయట కాలు పెట్టడానికి భయపడే టైంలో కూడా ఆయన జిల్లా జిల్లా తిరుగుతూ కమిటీ ల కోసం కష్టపడ్డ తీరు నాకు ఇంకా గుర్తుంది.
మాన్యశ్రీ కాన్షీరామ్ గారు చెప్పినట్లు ఒక బలమైన వాదానికి, ఒక బలమైన నాయకుడిని జోడిస్తే ఆ ఉద్యమం బలపదుతుంది అన్న మాటలు గుర్తు చేసుకొని, ఈ ఉద్యమాన్ని ముందుకు నడపాలంటే ఒక బలమైన నాయకుడు కావాలంటూ ,అది
Dr RS ప్రవీణ్ కుమార్ గారు అయితే బాగుంటుందని ఆలోచన చేశారు. అనుకున్నట్లుగానే ఆ సమయం రానే వచ్చింది.
ఆగస్టు 8, 2021 నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ రాష్ట్ర ఇంచార్జ్ రాంజీ గౌతమ్ గారి చేతుల మీదుగా ఆనాటి రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకొని అశేష జనవాహిని మధ్య బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు. బహుజన సమాజ్ పార్టీ కి తెలంగాణలో ఈరోజు ఒక మైలురాయి. బహుజన ఉద్యమానికి తెలంగాణలో ఒక బలమైన నాయకుడు దొరికాడు. నిరంతరం పేద ప్రజల అభ్యున్నతికి పాటు పడే నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ పార్టీలోకి రావడం తో పార్టీ లో ఉన్న నాయకులు కార్యకర్త ల్లో నూతన ఉత్తేజం, ఉత్సాహం నిండింది. ఇంత బలమైన నాయకుడు బహుజన సమాజ్ పార్టీ లోకి రావడం దేశ వ్యాప్తంగా సంచలనమైంది. అందరూ బహుజన్ సమాజ్ పార్టీ గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఆ పార్టీలో రాష్ట్ర సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించారు.
అప్పటి అధ్యక్షులు మంద ప్రభాకర్ గారు మరియు RS ప్రవీణ్ కుమార్ గారు బహుజనుల ఏకం చేసేందుకు ఎన్నో ప్రణాళికలు రచించారు. ప్రజల మధ్యలో ఉండాలంటూ, సబ్బండ వర్గాలను ఏకం చేయాలంటూ జనవరి, 1 ,2022 నాడు రాష్ట్ర కమిటీ నాయకులంతా బహుజన నాయకుడు సర్వాయి సర్దార్ పాపన్న గౌడ్ జన్మస్థలం ఖిలా షాపూర్ నుంచి 300 రోజుల బహుజన రాజ్యాధికార యాత్రను చేపట్టాలని తీర్మానించారు.
మార్చ్ 6 ,2022 నాడు బహుజన బిడ్డ సర్వాయి సర్దార్ పాపన్న గౌడ్ స్ఫూర్తితో జనగామ జిల్లా లో మొదలైన బహుజన రాజ్యాధికార యాత్ర దాదాపు 750 గ్రామాల్లో గడప గడప ని కలుస్తూ, ప్రతి ఓటరు గుండెను తడుతూ, పల్లె పల్లెనా గ్రామ గ్రామాన తిరుగుతూ విజయవంతంగా 99 రోజులు పూర్తి చేసుకొని రేపు 100 వ రోజుని చేరుకోబోతోంది. దానికి జూన్ 26 నాడు హనుమకొండలో ని హయగ్రీవాచారి మైదానంలో 100 వ రోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడానికి వేలాదిగా జనం తరలివస్తున్నారు.
త్యాగనిరతికి నిదర్శనంగా నిలిచిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎందరికో ఆదర్శనీయులు.
దూరదృష్టితో భవిష్యత్ తరాల భవితవ్యం కోసం ఆలోచించిన మంద ప్రభాకర్ గారు ఆదరణీయులు.
జూన్ 10న డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ రాష్ట్ర అధ్యక్షులు గా బాధ్యతలు తీసుకున్నప్పుడు, మంద ప్రభాకర్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్య సమన్వయకర్తగా నియమించబడ్డారు. ఆనాడు ఎగ్జిబిషన్ గ్రౌండ్ అభినందన సభలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు "పార్టీ ముందుకు నడవాలని మంద ప్రభాకర్ గారు ఎంతో గొప్ప త్యాగం చేశారు, తన అధ్యక్ష పదవిని తృణ ప్రాయంగా వదిలి వేశారు. బహుశా ఇలా ఉన్నత పదవులను వదులుకునే వారు ఉండరేమో అన్నారు.
డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ గారి చేత కూడా అభినందనలు అందుకున్న మంద ప్రభాకర్ గారు తెలంగాణలో బహుజన సమాజ్ పార్టీ లో ఇన్ని విప్లవాత్మక మార్పులకు కారణం అనడం లో ఎలాంటి సందేహం లేదు.
.ఈ వంద రోజుల యాత్ర తో రాష్ట్రమంతా ఎండనక -వాననక, రాత్రనకా- పగలనకా , ఆకలి దప్పికలను మరచి, ప్రజలతో మమేకమై, వారి కన్నీళ్ళకు కారణాలు వెతుకుతూ, వారి సంతోషాలకు దారుల పరుస్తూ, ఎన్నో దారుల్లో సాగిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యాత్ర సామాన్యమైనది కాదు.
బహుజన రాజ్యాధికార యాత్రను దిగ్విజయంగా కొనసాగించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి,
సహకరించిన రాష్ట్ర కమిటీ నాయకులకు,
నిధులు సమకూర్చిన B1 నాయకులకు,
కార్యకర్తలకు, అశేష జనవాహిని కి, మీడియా మిత్రులకు, అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
హన్మకొండ సభ హైలెట్స్...
డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ గారు (బీఎస్పీ రాష్ట్ర ప్రెసిడెంట్)
*100 రోజుల బహుజన రాజ్యాధికార యాత్ర సభ*
• బిడ్డా కేసీఆర్...! నువ్వు జామర్లు,ఇంటలిజెన్స్ ఏజెంట్ లను పెట్టిన, ఈ సభను ఆపలేవు.
• ఇక్కడికి వచ్చిన వారు లక్ష మంది మాత్రమే ఉన్నారు, కానీ వీరి వెనుక కోట్ల మంది ఉన్నారు.
• మిత్రులారా! ఎన్ని వడగండ్ల వచ్చిన, వర్షం వచ్చిన మనం ఈ సభ కదలకుండా జరుపుకోవాలి.
• శ్రీ.రాంజీ గౌతమ్ గారు, శ్రీ.ఆకాష్ ఆనంద్ గార్లు తెలంగాణ,వరంగల్ ప్రజల గుండె చప్పుడు వినడానికి వచ్చారు మిత్రులారా !
జై భీమ్! తెలంగాణ! జై భీమ్! వరంగల్!!
• బిడ్డా! ఒక బహుజనుణ్ణి ప్రగతి భవన్ లో కూర్చోపెట్టే వరకు బహుజన రాజ్యాధికార యాత్ర ఆగదు.
• మీకు బీరు,బిర్యానీ,200 రూపాలు ఇచ్చారా మిత్రులారా.
• బిడ్డా, కేసీఆర్,రేవంత్ రెడ్డి, బండి సంజయ్ వినుండ్రి మా బిడ్డలు సభకు ఎట్లా వచ్చారో..
• ఒక వైపు కేసీఆర్ భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తా అంటుంటే, వరంగలో మా బిడ్డలు రిజర్వేషన్ల పితామహుడు సాహు మహరాజ్ గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు.
• ఈ యాత్ర మహానీయుల, ప్రో.జయశంకర్,అమరవీరుల స్పూర్తితో మొదలు పెట్టినాము.
• ఈ యాత్ర మొదలు పెట్టినప్పుడు విజయం సాధిస్తామా అనే సందేహం మొదలైంది, ఎందుకంటే మన వెనుక మెగా కంపెనీ లు లేవు, కాళేశ్వరం ప్రాజెక్టు కమీషన్లు లేవు మిత్రులారా.
• ఎన్నో అవమానాలు ఎదుర్కొని, కొడకండ్ల గ్రామంలో ఎర్రబెల్లి దయాకర్ రావు సారా సీసాలతో వ్యాపారం చేసే ఈయన, మేమున్న ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి బెదిరించారు.మమ్మల్ని ఇంట్లో ఉంచుకున్నందుకు. ఒక హాస్పిటల్ లో కింద పడుకున్నాము.
• మాన్యవార్ కాన్షిరాం గారు,మాయావతి గారు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు.
• తిరుమలగిరిలో ఒక తల్లి అన్నం పెడితే దళిత బంధు ఇవ్వను అని బెదిరించారు.
• హుజురునగర్ లో సూణ్యపాడ్ గ్రామంలో మీరు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లారని ఒక గిరిజన సోదరుడు మమ్మల్ని అడిగి బాధ పడ్డారు.
• మిర్యాలగూడలో 80 సంవత్సరాల రమణమ్మ మాకు గళ్ళ బుట్టి ఇచ్చి పోయింది.
• కేసీఆర్, మా వెనక ఉన్న కోటీశ్వర్లు వీళ్ళే...మీలా మేఘా కంపెనీ వాళ్ళు పెళ్ళిలకు డబ్బులు ఇచ్చినట్టు, ప్రాజెక్టుల్లో కమిస్షన్లు తీసుకోలే!
• 300కోట్లు తీసుకున్న ప్రశాంత్ కిషోర్,ప్రకాష్ రాజ్ లు చూడుండ్రి...
• గ్రామాల్లో క్రీడా మైదానాల కోసం బహుజనుల భూములు తీసుకుంటుండ్రు.
• మేము ఇంగ్లీష్ విద్యా అడుగుతే..మీరు ఇంగ్లీష్ మద్యం ఇస్తున్నారు.
• ఇల్లందు గ్రామంలో 11మంది కేసీఆర్ మాద్యం తాగి చనిపోయారు సార్ అని అన్నారు.
• తుంగుతుర్తి లో గాదరి కిషోర్ ఇసుక దందా ఇచ్చలవిడిగా చేస్తున్నారు. సిరిసిల్లలో కేటీఆర్(ట్విట్టర్ పిట్ట పిల్ల)కూడా దందా చేస్తే అక్కడ బీసీ,ఎస్సీ లు అడ్డుపడితే ఇష్టం వచ్చినట్టు కొట్టించిండ్రు.
• భద్రాద్రి కొత్తగూడెంలో ఇసుక కాంట్రాక్టులు ఆధిపత్య వర్గాలకు మాత్రమే ఇచ్చారు. మరి బహుజనులు?
• పోడు భూములకు పట్టాలు ఇచ్చే పార్టీ కేవలం బీఎస్పీ మాత్రమే ! రేపు మీ ఫార్మ్ హౌస్ లో కూడా భూములు గుంజుకుంటాం.
• పేదలందరికీ భూమి ఉచితంగా పంచుతాం.
• ప్రభుత్వం దగ్గర ఉన్న భూమి బహుజనులదే.దాని వాళ్ళ స్వంత వాడకాలకు
• బహుజన రాజ్యంలో 10 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. బహుజన కులాలు అందరూ నిజమైన జ్ఞానులు.
• నువ్వు నిజమైన జ్ఞానివైతే పీకే లు ఎందుకు?
• బండి సంజయ్ గుళ్ళు తొవ్వుతా అంటుండు, గిదేన నేర్చుకున్నది బండి సంజయ్?
• రేవంత్ రెడ్డి...రెడ్డిలు మాత్రమే రాజ్యమేలలా?
• రాజ్యన్న రాజ్యంలో జల యజ్ఞంలో అక్రమంగా సంపాదించుకున్న డబ్బులతో షర్మిల పాదయాత్ర చేస్తున్నది.
• రెక్కాడితే-డొక్కాడని బతుకులు మన బహుజనులవి.
• మనం ఓట్లు వేసిన ప్రజాప్రతినిధులు కేసీఆర్ దగ్గర కూర్చున్నారు, వారేట్ల మనకు న్యాయం చేస్తరు?
• గ్రామాల్లోకి అందరూ వెళ్ళాలి
• షామీరు 210కిలోమీటర్ల కరీంనగర్ నుండి సైకిల్ మీద మీటింగ్ వచ్చారు.
• తెలంగాణ ప్రభుత్వం మన బిడ్డల చదువుల కోసం డబ్బులు ఇస్తలేరు.
• అర్హులైన బిడ్డలకు విదేశీయులకు పంలిస్తాం
• గల్ఫ్ దేశాల్లో బీఎస్పీ కార్యాలయాలు ఏర్పాటు చేశారు.
• అర్హులైన అందరికి భూములు,డబుల్ బెడ్రూంలు ఇస్తాం.
• బాసరలో అమ్మాయిల టాయిలెట్ లో కుక్కలు, సరిగ్గా చదువులేదు బిడ్డలకు, ఫాదర్స్ డే సందర్భంగా బాసర IIIT బిడ్డలకు ఏమైనా బహుమానం ఇస్తాడు అనుకున్న కేసీఆర్..?
• రాబోయే రోజుల్లో మన రాజ్యం రాబోతుంది అని చెప్పండి.
• ఫీల్డ్ అసిస్టెంట్లు,పోలీస్ మిత్రులకు జరుగుతున్న అన్యాయం పై బీఎస్పీ ఎప్పుడు పోరాడుతుంది.
• అగ్నిపథ్ స్కీం కు పూర్తిగా బీఎస్పీ విరుద్ధం.
*రాంజీ గౌతమ్ గారు*
• ప్రజలారా! 2025లో కచ్చితంగా ప్రగతి భవన్ లో ఎగరవేస్తాం.
• ఈ దేశంలో అందరికి సామాజిక న్యాయం జరగాలి, మనకు అధికారం వస్తే మన మహానీయుల ఆశయాలను నిరవేరుస్తాం.
• ఈ రాష్ట్ర ప్రజలు బహుజన రాజ్యాధికారం ఆశిస్తున్నారు. ఈ దేశంలో రాజ్యాంగం పై యుద్ధం జరుగుతుంది.
• ఈ యుద్ధంలో మనం గెలవాలంటే కేవలం బాబాసాహెబ్ ఇచ్చిన ఓటుతో మాత్రమే యుద్ధం గెలుస్తాం.
• ఒక బీజేపీ ఎంపీ పార్లమెంట్లో రాజ్యాంగాన్ని మారుస్తాం అన్నారు, అంతే కాక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా మారుస్తాం అన్నారు.
• మీరు ఎట్టి పరిస్థితుల్లో అలిసిపోవద్దు, గ్రామాల్లోకి వెళ్లి సామాజిక పరివార్తన కోసం పాటుపడాలి.
• మనం నిరంతరం మన మహనీయుల ఆశయాల కోసం పనిచేయాలి గ్రామాల్లోకి వెళ్లి.
• ఏ భూములైతే ప్రభుత్వానివో అవి మనవే..!!
శ్రీ.ఆకాష్ ఆనంద్ గారు
• తెలంగాణ భూమి మీద నిలబడి మాట్లాడుతున్నందుకు
తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు.
• డా.ఆరెస్పీ గారు ఒక వ్యక్తి, మిత్రులారా, ప్రవీణ్ గారు పేద బిడ్డలకు ఎంతో సేవ చేసారు.
• ఈ ప్రభుత్వం యొక్క హామీలు బలంగా కనిపించిన,లోపల ఏమి ఉండదు.
• కేసీఆర్ గారు మీరిచ్చే హామీలు మా కాళ్ళ మీద మమ్మల్ని నిలబడిపెట్టలేవు.
• మిత్రులారా! మీరు ఆలోచించించండి, ఎన్ని రోజులు మోసపోతారు.
• కేసీఆర్ గారు బహిజానులకు రావాల్సిన హక్కులు వస్తే వాళ్ళ కాళ్ళమీద వాళ్లే నిలబడుతారు.
• హామీలు మీరు నిరవేర్చిన లేకపోయినా అధికారంలోకి మేము వస్తాం...అన్ని నెరవేరుస్తాం.
• 2022లో అందరికి ఉద్యోగాలు వచ్చాయా మోడీ.
• మాన్ కి బాత్ కాదు-కామ్ కి బాత్ చెప్తున్నాము మేము.
• 1లక్ష, 25000 గూండాలను జైల్లో వేయించారు మాయావతి గారు.
• బడుగు బలహీన వర్గాలు తరుపున కొట్లాడుతున్న ఏకైక వ్యక్తి బెహేన్జీ గారు.
• 600కోట్లు 7 లక్షల బాల బాలికల కోసం ఖర్చు చేయడం జరిగింది.
• వితంతవులకు రూ. 1,25000 నేరుగా వాళ్ళ అకౌంట్లో పడేట్టు చేశారు. మొత్తం 3000కోట్లు.
• మోడీ గారు మీ అకౌంట్లుకి డబ్బులు వేస్తామని మోసం చేయము. నేరుగా వేసేస్తాం డబ్బు.
• మహా మాయా నివాస్ యోజన ఈ పథకం ద్వారా అందరి పేదలకు ఇండ్లు కట్టించారు.
• రూ.1లక్ష,2500 వేల ఎకరాలు పంచడం జరిగింది పేదలకు.
1000 Pillar Temple, Warangal
Located on the slopes of the Hanumakonda hill close to Warangal in Telangana, the Thousand Pillar temple(Veyyi Stambhala Gudi ) or the Rudreswara Swamy Temple is a popular pilgrimage in warangal. This temple has a long history and dates back to 1163 AD and took 72 years to construct! It was destroyed by the Tughlaq dynasty during their invasion of South India.
It comprises one temple and other…
View On WordPress