Four killed, many in critical condition in a serious road accident in Mahbubnagar-Nalgonda district
seen from Germany
seen from China
seen from Brazil
seen from United States

seen from United States
seen from United States
seen from United States
seen from Singapore

seen from Netherlands
seen from United States
seen from China
seen from Yemen

seen from Maldives
seen from Argentina
seen from Germany
seen from China

seen from United States

seen from Ukraine

seen from United States
seen from Maldives
Four killed, many in critical condition in a serious road accident in Mahbubnagar-Nalgonda district
Another big shock to BRS.. MLA, MLC joining Congress ! Trinethram News : Telangana : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాక
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో తెల్ల కల్లు బార్లు
Trinethram News : మహబూబ్నగర్ జిల్లా:మార్చి 04 రాష్ట్రంలో రానున్న రోజుల్లో ‘కల్లు బార్ల్లు’ ఏర్పా టు చేసే దిశగా తమ ప్రభుత్వం కార్యాచరణ రూపొంది స్తుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. గౌడ సంఘం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు ఆనంద్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఎఎస్ఎన్ ఫంక్షన్ హాల్లో గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళ నం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత కాలానుగుణంగా కులవృత్తులు మారుతున్నా యని, అన్ని రకాల వ్యాపా రాల తీరు మారుతోందని అన్నారు. ఈ నేపథ్యంలో అనాదిగా వస్తున్న కల్లుగీత వృత్తి నేడు కనుమరుగు అవుతుందని ఈ వృత్తిని కాపాడాల్సి అవసరం ఉందన్నారు. గీత కార్మికుల వృత్తిని కూడా ఆధునికీకరించాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు. అందులో భాగంగా కల్తీ కల్లు లేకుండా గౌరవప్రదంగా విక్రయించే దిశగా ప్రభుత్వ పరంగా కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో ఇది కార్యరూపం దాల్చే అవకాశం ఉందని, దీనివల్ల ఎంతోమందికి మేలు చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. సర్వాయి పాపన్న విగ్రహం ట్యాంక్బండపై ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళ నంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, పలువురు ఎంఎల్ఎలు, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనా రెడ్డి, మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, నాయకులు పాల్గొన్నారు.
Read the full article
మహబూబ్నగర్లో వీధి కుక్కలపై బుల్లెట్ల వర్షం.. భయాందోళనలో ప్రజలు
Trinethram News : మహబూబ్నగర్:- మహబూబ్నగర్ జిల్లాలో వీధి కుక్కలను తుపాకులతో కాల్చి చంపడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. మూసాపేట్ మండలం పొన్నకల్ గ్రామంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం తెల్లవారుజామున గ్రామంలో 20 వీధి కుక్కలను కాల్చి చంపారు. ఈ కుక్కలను తుపాకీతో కాల్చి చంపినట్లు తెలుస్తున్నది. తుపాకుల మోత వినిపించకుండా సైలెన్సర్ బిగించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. గ్రామంలో ఉన్న కుక్కలన్నింటినీ చంపడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అసలు కాల్చింది ఎవరు? ఎందుకు తుపాకులతో కుక్కలను కాల్చారు అనేది మిస్టరీగా మారింది. కుక్కల కోసం తుపాకులు వినియోగించడం ఏంటని పోలీసులు సైతం విస్తుపోతున్నారు. తెల్లవారుజామున గ్రామంలో వీధి కుక్కలు రక్తపు మడుగులో పడి ఉండడం చూసిన గ్రామస్తులు షాక్కు గురయ్యారు.వెంటనే అప్రమత్తమై ఎలా చనిపోయాయని ఆరా తీస్తే పక్కనే బుల్లెట్లు తగిలి చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ విషయం దావనంలో పాకడంతో గ్రామం మొత్తం నిర్ఘాంత పోయింది. వెంటనే పోలీసులకు సమాచారం అం దించారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కుక్కలను చంపింది ఎవరు? ఎందుకు చంపారనే దానిపై ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
Read the full article
టికెట్ కోసం టఫ్ ఫైట్.. హాట్ సీటుగా మహబూబ్నగర్ ఎంపీ స్థానం
Trinethram News : మహబూబ్నగర్ జనవరి17(జోగులాంబ ప్రతినిధి):- మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్న పలువురు నేతలు ముమ్మరంగా ప్రచారాన్ని ప్రారంభించారు.ఓ వైపు పార్టీ కార్యక్రమాలు, మరోవైపు భక్తి, ఇతర సామాజిక కార్యక్రమాలతో జనానికి చేరువయ్యేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్ టికెట్ తమకంటే తమకే వస్తుందంటూ ఎవరి ధీమాలో వారు ఉన్నారు. జాతీయ నాయకురాలిగా, మహిళ నాయకురాలిగా, గత పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కారణంగా ఈ సారి టికెట్ తప్పనిసరిగా తనకే వస్తుందన్న ధీమాతో డీకే అరుణ ముందుకు వెళ్తున్నారు. పార్లమెంటు పరిధిలోని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటనలు చేస్తూ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ముగ్గులు, క్రీడలు తదితర పోటీలను నిర్వహించడంతో పాటు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా, గత పార్లమెంటు ఎన్నికలకు ముందు జరిగే ఎన్నికల్లో టికెట్ హామీతోనే పార్టీలో చేరిన జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్ రెడ్డి ఈసారి టిక్కెట్టు తప్పనిసరిగా తనకే వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన కుమారుడిని పోటీ చేయించడంతో పాటు పార్లమెంటు పరిధిలో ఉన్న అభ్యర్థుల కోసం తన వంతు ప్రయత్నాలు సాగించారు. అధిష్టానంతో ఉన్న పరిచయాలు, తదితర కారణాల వల్ల అవకాశం తనకే వస్తుంది అన్న నమ్మకంతో ఉన్నారు. ఇందులో భాగంగానే ఆయన ఢిల్లీలో పలువురు ముఖ్య నేతలను కూడా కలిసి తనకు టికెట్ను ఇవ్వాలి అని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఇప్పటికే రెండు మూడుసార్లు పార్టీ ప్రయోజనాల కోసం టికెట్ను త్యాగం చేశాను. పార్టీ అధిష్టానం వచ్చే ఎన్నికలలో తప్పనిసరిగా పోటీ చేసేందుకు అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారు. ఈసారి బీసీ కోటాలో తనకు తప్పకుండా టికెట్ వస్తుందన్న నమ్మకంతో శాంతి కుమార్ ఉన్నారు. అదేవిధంగా ఈ ముగ్గురితో పాటు బీజేపీ రాష్ట్ర నేత, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి సైతం తనకు మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ టికెట్ ఇవ్వాలని అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది. కలిసికట్టుగా పని చేస్తేనే.. మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు నాయకులు టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేసుకుంటున్నారు. టికెట్ ఒకరికి వస్తే మిగతా వారు ఏ మేరకు సహకరిస్తారన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో గెలిచే అవకాశాలు మెండుగా ఉన్న కారణంగా టికెట్ కోసం నాయకులు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. బయటకు టికెట్ ఎవరికి వచ్చిన గెలిపిస్తామరని చెబుతున్నా.. అంతర్గతంగా మాత్రం ఒకరు అంటే ఒకరికి గిట్టని పరిస్థితులు నెలకొంటున్నాయి. పార్టీ అధిష్టానం టికెట్ ఆశిస్తున్న నేతలతో సమావేశమై సమన్వయం కుదిరిస్తే తప్పా.. పార్టీ అభ్యర్థులు గెలవడం సాధ్యం కాని పరిస్థతి కాదు. రానున్న రోజులలో అధిష్టానం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందోనన్న సందేహాలు ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తం అవుతున్నాయి.
Read the full article
United Muslim Action Committee is Organising a Protest Public Meeting against Citizenship Amendment Act Today at 6pm in Mahbubnagar. AIMIM President Barrister Asaduddin Owaisi, Religious Scholars and Intellacutals addressing at the meeting.