నిన్న ఆదివారం (14-06-2026) వరకు జరిగిన పరోక్ష శాంతి చర్చల పర్యవసానంగా సోమవారం జూన్ 15 తేదీన ఇరాన్, అమెరికా దేశాల మధ్య ఒక అవగాహన (మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ -ఎం.ఓ.యు) కుదిరిందని పాకిస్తాన్, ఇరాన్, అమెరికా దేశాల ప్రతినిధులు ప్రకటించారు. అవగాహన కుదిరిందన్న ప్రకటన తెలిసిన తర్వాత స్టాక్ మార్కెట్ లు బుస్సు మని పైకి పొంగగా, అంతర్జాతీయ చమురు ధరలు కనీసం 5 శాతం పైగా తగ్గిపోయాయి. అంటే ఇరాన్-అమెరికా దేశాల సో-కాల్డ్ శాంతి ఒప్పందాన్ని మార్కెట్లు ఆనందంతో స్వాగతించాయి.

















