బుల్లితెర భామలు హీరోయిన్స్ కి ఏ మాత్రం తగ్గరు!
'అష్టాచమ్మా' సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది చైత్రరాయ్.. కన్నడ అమ్మాయి అయినప్పటికి తెలుగు అమ్మాయిలాగా అందరి మనసులను దోచేసింది.
ఆశ్మిత.. రాజస్తాన్ అమ్మాయి.. తెలుగులో ఓ పదిహేను సీరియల్లో నటించింది. ఈ టీవీలో వచ్చిన పద్మవ్యూహం, చంద్రముఖి, మేఘసందేశం సీరియల్స్ కి మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం సీరియల్స్ చేయకపోయిన అందంతో ఆకట్టుకుంటుంది.
సుహాసిని.. వెండితెర నుంచి బుల్లితెరకి వచ్చింది ఈ నటి.. బి. జయ దర్శకత్వంలో వచ్చిన చంటిగాడు సినిమాతో వెండితెర పైకి వచ్చి సుమారుగా 20 సినిమాల్లో నటించింది. ఆ తరవాత అపరంజి సీరియల్ ఆమెకి మంచి పేరును తీసుకువచ్చింది.
మనసు మమత సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు కనెక్ట్ అయింది నటి హరితేజ .. అభిషేకం, రక్త సింధూరం వంటి సీరియల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది . హోస్ట్ గా కూడా పలు కార్యక్రమాలకి వ్యవహరించింది. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉంది,
శ్వేత శాలిని.. చేసింది కొన్ని సీరియల్స్ అయినప్పటికీ చిన్న కోడలు మాత్రం ఆమెకి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఎక్కువగా గ్లామర్ తో ఆకట్టుకుంది శ్వేత ..
మౌనిక.. రాదా మధు, అభిషేకం, రామ సీత సీరియల్స్ లో నటించి మంచి పేరు సంపాదించుకుంది . మహేష్ హీరోగా వచ్చిన అతడు సినిమాలో కూడా మౌనిక నటించింది. Also Read :బుల్లితెర రాములమ్మ.. అందాలతో విందు
మేఘన లోకేష్.. శశిరేఖా పరిణయం సీరియల్ తో చాలా ఫేమస్ అయింది. 2017లో వచ్చిన ఇది మా ప్రేమ కథ చిత్రంలో కూడా నటించింది.
పల్లవి గౌడ.. కన్నడ నటి.. పసుపు కుంకుమ సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులకు ఆకట్టుకుంది. సావిత్రి సీరియల్ తరవాత మళ్ళీ నటించలేదు.. మలయాళం, కన్నడ సీరియల్స్ లో నటిస్తుంది.
ప్రస్తుతం పాపులర్ అవుతున్న కార్తీక దీపం సీరియల్ లో మౌనితగా నటిస్తుంది శోభా శెట్టి .. కన్నడ నటి అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులను తనదైన నటనతో బాగా ఆకట్టుకుంటుంది.
ప్రియాంకా జైన్ .. వినరా సోదరా వీర కుమార అనే సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి ఫేం సంపాదించుకుంది. ఇక మౌనరాగం అనే సీరియల్ లో నటించింది.
సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది అయేషా.. మోడలింగ్ తో పాటు తమిళ్ సీరియల్స్ లో కూడా నటిస్తోంది. మరిన్ని అప్డేట్స్ పొందడానికి మా టెలిగ్రామ్ ని ఫాలో అవ్వండి! Read the full article







