వాహన చోదకులు హెల్మెట్ ధరించాలి: ఎస్పీ గద్వాల : వాహన చోదకులు
seen from United Kingdom
seen from United States
seen from United States
seen from United States
seen from Russia

seen from United States
seen from United States
seen from France
seen from United States
seen from China

seen from Malaysia

seen from United States

seen from United States
seen from Canada
seen from China
seen from China
seen from Saudi Arabia
seen from Italy

seen from Belarus
seen from United States
వాహన చోదకులు హెల్మెట్ ధరించాలి: ఎస్పీ గద్వాల : వాహన చోదకులు
Trinethram News : జోగుళాంబ గద్వాల జిల్లాలో సాగు నీటితో పాటు తాగునీటికి తండ్లాట ప్రారంభమైంది. గతంలో ఎప్పుడూ లేనంతగా గత నెల నుంచే నీటి కష్టాలు షురూ అయ్యాయి.
జములమ్మ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన గద్వాల ఎమ్మెల్యే దంపతులు
Trinethram News : గద్వాల పట్టణం:-గద్వాల పట్టణంలో జమ్మి చెడు జమ్ములమ్మ అమ్మ వారి పరుశురాముడు స్వామి బ్రహ్మోత్సవాలు (గద్వాల జాతర, పౌర్ణమి) సందర్భంగాశనివారం ఉదయం వేద బ్రాహ్మణులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యే దంపతులకు స్వాగతం పలికారు.నడిగడ్డ ఇలవేల్పు అమ్మవారికి ఎమ్మెల్యే దంపతులు బండ్ల జ్యోతి కృష్ణమోహన్ రెడ్డి దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీ జమ్ములమ్మ అమ్మ వారికి దేవాలయంలో అమ్మవారి విగ్రహాన్ని పవిత్రమైన కృష్ణా నీటితో 108 కలశం తో అభిషేకం నిర్వహించారు. ఎమ్మెల్యే దంపతులు మొదటి పూజ నిర్వహించి అమ్మవారి ఆశీస్సులను పొందడం జరిగింది. పరుశురాముడు స్వామి దేవాలయం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్యే దంపతులు.ఎమ్మెల్యే మాట్లాడుతూ..ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా అమ్మవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని వివిధ ప్రాంతాల నుంచి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అమ్మవారిని దర్శించుకుని వారి మొక్కులను చెల్లించుకోవడం జరుగుతుందన్నారు. కావున వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మూడు నెలలపాటు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. నడిగడ్డ ప్రజల ఇలవేల్పు అయిన అమ్మవారి దర్శనానికి ప్రతి మంగళవారం, శుక్రవారం వేలాది మంది భక్తులు వస్తారని, నడిగడ్డ ప్రాంతంలో జమ్ములమ్మ అమ్మవారు ప్రతి ఇంటిలో ఏ శుభకార్యం జరిగిన మొదటగా అమ్మవారిని మొక్కలను చెల్లించుకుని వివాహ శుభ కార్యాలను నిర్వహించుకోవడం ఆనవాయితీగా కొనసాగుతుందని తెలిపారు.శ్రీ అమ్మవారి ఆశీస్సులతో గద్వాల నియోజకవర్గ ప్రజలందరికీ, రైతులు వ్యవసాయ రంగంలో పాడి పరిశ్రమలు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గాయత్రి సతీష్, కౌన్సిలర్ శ్రీమన్నారాయణ, ఆలయ కమిటీ డైరెక్టర్స్ అభిలాష్, ఓం ప్రకాష్, ఈవో పురేందర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Read the full article
పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రాజు
Trinethram News : గట్టు మండలం ( ఫిబ్రవరి 21): జోగులాంబ గద్వాల జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రము గట్టులో అంగన్వాడీ టీచర్లకు పల్స్ పోలియో కార్యక్రమం మరియు ఎన్ డి డి ప్రోగ్రాం లో బుధవారం ఏర్పాటుచేసిన పల్స్ పోలియో ట్రైనింగ్ ప్రోగ్రాం కార్యక్రమం లో డాక్టర్ రాజు మాట్లాడుతూ 0 - 5 వయస్సుగల పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయాలని ఈ కార్యక్రమం ఇదివరకు అందరం కలిసి చేసి విజయవంతం చేశామని ఈ సంవత్సరం కూడా పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజశేఖర్ సిహెచ్ ఓ హుస్సేన్ జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్స్ శ్యాంసుందర్ మరియు మక్సూద్ సూపర్వైజర్ స్వర్ణలత, అంగన్వాడీ టీచర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు
Read the full article
శ్రీశ్రీశ్రీ జములమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గారి సతీమణి శ్రీమతి బండ్ల జ్యోతి
ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ జమ్ములమ్మ మరియు పరశురామస్వామి వారి దేవస్థానం నందు బ్రహ్మోత్సవాల(జాతర) సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న గద్వాల ఎమ్మెల్యే బండ్ల జ్యోతి కృష్ణ మోహన్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి బండ్ల జ్యోతి, దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులను పొందడం జరిగింది.. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
Read the full article
ఈ నెల 19న GHMC సర్వసభ్య సమావేశం
సోమవారం ఉదయం 10 గంటలకు మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జరగనున్న మీటింగ్. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు GHMC కౌన్సిల్ మీటింగ్. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి GHMC కౌన్సిల్ మీటింగ్…
Read the full article