బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాలన్నీ చెల్లిస్తానని ప్రకటించాడు లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా. బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగనామం పెట్టి లండన్ పారిపోయిన మాల్యా ఎట్టకేలకు దిగొచ్చాడు. భారత ప్రభుత్వం అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెంచడంతో ఆయనకు దిగిరాక తప్పలేదు. బ్యాంకులకు బకాయి పడ్డ రుణాలన్నింటినీ చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించాడు. దీనికి సంబంధించి ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఏప్రిల్ 15వ తేదీనే లేఖ రాసినట్లు తెలిపాడు. తాజాగా ఆ లేఖలను బయటపెడుతూ.. వాటిపై ప్రధాని, ఆర్థిక మంత్రి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి బదులు రాలేదని చెప్పాడు. ప్రభుత్వ రంగ బ్యాంకులతో ఉన్న రుణాలన్నింటినీ సెటిల్ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని మాల్యా చెప్పాడు. ఈ ప్రయత్నాలు కొనసాగిస్తుండగానే తనను బ్యాంక్ డిఫాల్టర్గా చూపిస్తూ చేస్తున్న ప్రచారం చూస్తుంటే బాధ కలుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. మీడియాలో జరుగుతున్న ప్రచారంతో ప్రజలు తనపై ఆగ్రహంతో ఉన్నారని ఆయన తెలిపాడు. తీసుకున్న రుణాలన్నింటినీ సెటిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. భారత ప్రభుత్వం నాపై కనికరం లేకుండా వ్యవహరిస్తోందిని ఆరోపించాడు. ఇలాంటి వ్యవహారాలతో నేను అలసిపోయానని… రుణాలను రికవరీ చేయడం సివిల్ విషయం… కానీ, నాది మాత్రం క్రిమినల్ కేసుగా వ్యవహరిస్తున్నారన్నాడు మాల్యా. ఆస్తుల అమ్మకంతో ద్వారా తాను బ్యాంకులకు రుణాలు చెల్లిస్తానని.. న్యాయ పర్యవేక్షణలో ఉన్న తన స్తులను అమ్మడానికి కోర్టు అనుమతి ఇవ్వాలని కోరాడు మాల్యా.
Vijay Mallya says to pay his dues... #VijayMallya #Dues #13000Crores #LiquerKing #DotNews #Banks













